నకిలీ వెబ్సైట్ను నడుపుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ముఠా అరెస్ట్
- December 14, 2022
దుబాయ్: బంగారాన్ని విక్రయించే నకిలీ వెబ్సైట్ను నడుపుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బంగారాన్ని విక్రయిస్తున్న నకిలీ వెబ్సైట్ ద్వారా మోసపోయామని పలువురి నుంచి తమకు ఫిర్యాదులు అందాయని దుబాయ్ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగంలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కస్టమర్లు చట్టపరమైన ధర కంటే తక్కువ ఖర్చుతో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని సైట్ లో పేర్కొన్నారన్నారు. బాధితులు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి లావాదేవీలు పూర్తి చేసినప్పుడు, కొనుగోలు పూర్తయినట్లు సందేశాలు వచ్చాయి. అయితే, వారికి బంగారం అందకపోగా వారి కార్డు డేటాను దొంగిలించి ఆయా ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేశారని తెలిపారు.
పోలీసులు సైట్ను ట్రాక్ చేసి.. నడిపిన వారిని గుర్తించారని అధికారి తెలిపారు. వీరి నివాసంపై పోలీసులు దాడి చేయగా ఆరుగురు నిందితులు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించి, నకిలీ వెబ్సైట్ను మూసివేయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









