నకిలీ వెబ్సైట్ను నడుపుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ముఠా అరెస్ట్
- December 14, 2022
దుబాయ్: బంగారాన్ని విక్రయించే నకిలీ వెబ్సైట్ను నడుపుతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. బంగారాన్ని విక్రయిస్తున్న నకిలీ వెబ్సైట్ ద్వారా మోసపోయామని పలువురి నుంచి తమకు ఫిర్యాదులు అందాయని దుబాయ్ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగంలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కస్టమర్లు చట్టపరమైన ధర కంటే తక్కువ ఖర్చుతో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని సైట్ లో పేర్కొన్నారన్నారు. బాధితులు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి లావాదేవీలు పూర్తి చేసినప్పుడు, కొనుగోలు పూర్తయినట్లు సందేశాలు వచ్చాయి. అయితే, వారికి బంగారం అందకపోగా వారి కార్డు డేటాను దొంగిలించి ఆయా ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేశారని తెలిపారు.
పోలీసులు సైట్ను ట్రాక్ చేసి.. నడిపిన వారిని గుర్తించారని అధికారి తెలిపారు. వీరి నివాసంపై పోలీసులు దాడి చేయగా ఆరుగురు నిందితులు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించి, నకిలీ వెబ్సైట్ను మూసివేయించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







