దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- July 03, 2026
విజయవాడ: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే ఆంధ్రప్రదేశ్ యువతకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) శుభవార్త అందించింది. దుబాయ్ (యూఏఈ)లో ట్యాక్సీ డ్రైవర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు AED 4,000 నుంచి AED 5,000 వరకు వేతనం అందించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు అయి ఉండాలి. కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండటంతో పాటు చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వరకు వసతి సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తుంది. అలాగే వీసా, విమాన ప్రయాణ ఖర్చులను కూడా యజమాని సంస్థే భరిస్తుంది.
ఈ నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జూలై 7, 2026న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలోని ఓఎంసీఏపీ లిమిటెడ్ కార్యాలయం, ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా/రెజ్యూమ్, పాస్పోర్ట్ ప్రతులు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, విద్యార్హత ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.
ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 నంబర్లను సంప్రదించాలని ఏపీఎస్ఎస్డీసీ తెలిపింది.

తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







