అడవుల్లో దొరికిన ఎముకలు శ్రద్ధా వాల్కర్వే..తేల్చిన డీఎన్ఏ పరీక్ష
- December 15, 2022
న్యూఢిల్లీ: ఢిల్లీలో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాల్కర్ను ఆమె భాయ్ఫ్రెండ్ అమీన్ పూనావాలా అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి .. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఆ కిరాతక మర్డర్ గురించి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు. సమీప అడవుల్లో శ్రద్ధా శరీర భాగాలను సేకరించిన పోలీసులు వాటిని డీఎన్ఏ పరీక్ష నిమిత్తం పంపారు. అయితే ఢిల్లీ అడవుల్లో దొరికిన ఎముకలు శ్రద్ధా వాల్కర్వే అని డాక్టర్లు తేల్చారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. మెహరౌలీ, గురుగ్రామ్ అడవుల నుంచి ఢిల్లీ పోలీసులు శ్రద్ధా ఎముకల్ని సేకరించారు. అయితే ఆ ఎముకలకు జరిపిన పరీక్షలో.. ఆమె తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









