దుబాయ్ లో 'నైలు నది' పురస్కారాలు ప్రధానం

- December 22, 2022 , by Maagulf
దుబాయ్ లో \'నైలు నది\' పురస్కారాలు ప్రధానం

దుబాయ్: దుబాయ్ లో జీవనది ఫౌండేషన్, శ్రీ సద్గురు ఓల్డేజ్ హోమ్ హైదరాబాద్ సంయుక్తంగా యూఏఈలోని ప్రముఖులకు  'నైలు నది' పురస్కారాలు  ప్రధానం చేశారు.దుబాయ్ లోని తెలుగు వ్యాపార వేత్త SRR గ్రూప్ అధినేత తోట రామ్ కుమార్ ని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు.

యూఏఈలోని పలువురు సామజిక సేవకులు,కళాకారులు,గాయకులు మరియు మీడియా ప్రతినిధులకు 50 మందికి 'నైలునది' అవార్డులు అందజేసారు.
జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు  ఇంటి లక్ష్మి దుర్గ మాట్లాడుతూ...నదులు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూఏఈలోని ప్రముఖులు ధర్మరాజు,జువ్వాడి శ్రీనివాస్, కటుకం రవి, శ్రీకాంత్ చిత్తర్వు,ప్రీతి తాతంబొట్ల,శ్రావణి, దినేష్ కుమార్ ఉగ్గిన,శ్యామ్ తిరుమలశెట్టి,రవి ఉట్నూరి,కిరణ్ కుమార్, పాల్తీ శ్రీనివాస్,ఓబిలిశెట్టి అనురాధ,గుర్రం పూర్ణ శాంతి, గుండెల్లి నర్సింహులు, మల్లేష్ కోరేపు తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com