శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు విడుదల...

- December 24, 2022 , by Maagulf
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు విడుదల...

తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి.ఈ మేరకు శనివారం (డిసెంబర్ 24,2022)న టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు టీటీడీ సూచించింది.అలాగే జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఆ రోజున వీఐసీ బ్రేక్ దర్శనాలకు అనుమతి లేదు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న ఎటువంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. భక్తులు సహకరించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com