బహ్రెయిన్లో BAPS దేవాలయం ఒక 'అద్భుతం': ఎస్ జైశంకర్
- January 09, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్లోని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (BAPS) ఆలయాన్ని "గల్ఫ్లో వరుసగా రెండు అద్భుతాలలో" ఒకటిగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అభివర్ణించారు. ప్రముఖ స్వామి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా “గల్ఫ్ దేశాల దినోత్సవం”లో ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఒక దేవాలయం అబుధాబిలో నిర్మాణంలో ఉండగా.. మరొకటి బహ్రెయిన్లో నిర్మాణంలో ఉన్నదని పేర్కొన్నారు."గల్ఫ్లో వరుసగా రెండు అద్భుతాలు’’ జరగుతున్నాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు. BAPSని స్థానిక, ప్రపంచ సాంప్రదాయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సాంకేతికతను ఉపయోగించే సంస్థ అని కూడా పేర్కొన్నారు.
ప్రముఖ్ స్వామి ఆదర్శాలు తనకు విదేశాంగ విధానంపై కూడా స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్న జైశంకర్.. జి20తో ఉదహరిస్తూ ‘వసుధైవ కుటుంబం’ భావనను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన గల్ఫ్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..









