అల్లు అర్జున్కు ‘గోల్డెన్ వీసా’ జారీ చేసిన యూఏఈ ప్రభుత్వం
- January 20, 2023
దుబాయ్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశమంతటా పుష్ప సినిమాతో చాలా పాపులర్ అయిపోయాడు. పుష్ప ముందు వరకు తెలుగు, మలయాళంలో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పడు దేశవ్యాప్తంగా పేరు, అభిమానులని సంపాదించుకున్నాడు. బన్నీ నుంచి పుష్ప 2 సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే పుష్ప 2 సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టారు.
తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.దుబాయ్ ప్రభుత్వం అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా అందించింది.ఓ దుబాయ్ అధికారితో కలిసి అల్లు అర్జున్ దిగిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి..ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు దుబాయ్. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ దుబాయ్ వస్తాను అని పోస్ట్ చేశాడు.దీంతో బన్నీ గోల్డెన్ వీసా అందుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు.. చిత్ర పరిశ్రమకు చెందిన షారుఖ్ఖాన్,కమల్ హస్సన్,సంజయ్ దత్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ తదితరులు ఆ వీసాను పొందారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







