రెసిడెన్సీ వీసాదారులకు శుభవార్త.. రీ-ఎంట్రీల దరఖాస్తుకు అనుమతి
- January 30, 2023
యూఏఈ: ఆరు నెలలకు పైగా ఎమిరేట్స్ వెలుపల ఉండే యూఏఈ రెసిడెన్సీ వీసా హోల్డర్లు ఇప్పుడు దేశంలోకి తిరిగి ప్రవేశించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నివాసితులు ఎక్కువ కాలం దేశం వెలుపల ఉన్నందుకు కారణాన్ని తెలపాల్సి ఉంటుంది. అలాగే దానికి రుజువును అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు నోటిఫికేషన్ను స్వీకరించినట్లు ట్రావెల్, టైపింగ్ సెంటర్ ఏజెంట్లు ధృవీకరించారు. నివాసితులు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెబ్సైట్లో ఈ సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ICP ఆమోదించిన ఇమెయిల్ పొందిన తర్వాత మాత్రమే దరఖాస్తుదారు దేశంలోకి తిరిగి ప్రవేశించగలరు. ఆమోదం ప్రక్రియ పూర్తవ్వడానికి సుమారు ఐదు పని దినాలు పడుతుంది. అల్ మాస్ బిజినెస్మెన్ సర్వీస్ జనరల్ మేనేజర్ అబ్దుల్ గఫూర్ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ధృవీకరించారు. కోవిడ్-19కి ముందు ఇన్ పర్సన్ సిస్టమ్ అమలులో ఉండేదని, కానీ ఇప్పుడు అది ఏకీకృతం చేయబడిందని, ఆన్లైన్లో అప్లై చేయవచ్చని ఆయన తెలిపారు. టి.పి. డీరా ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సుధీష్ కూడా నోటిఫికేషన్ వచ్చినట్లు ధృవీకరించారు. నివాసులు అనుసరించాల్సిన ఆమోద ప్రక్రియ ICP ఇ-ఛానెల్స్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
రెసిడెన్సీ సాధారణంగా 180 రోజుల పాటు దేశం వెలుపల ఉన్నట్లయితే ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. కాగా, గోల్డెన్ వీసా హోల్డర్లు మాత్రం ఎంతకాలమైన విదేశాలలో ఉండే అవకాశం ఉంది. యూఏఈ అతిపెద్ద ఎంట్రీ, రెసిడెన్సీ వీసా సంస్కరణలు గత ఏడాది అక్టోబర్లో అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







