BD15,000 మోసం కేసులో ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు
- February 01, 2023
బహ్రెయిన్: ఖాతాదారుల నుండి డబ్బును తీసుకోని BD15,000 మేర కంపెనీని మోసగించాడని యజమాని ఆరోపించిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని మైనర్ క్రిమినల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సాక్షుల వాంగ్మూలాలు, ప్రతివాదిపై వచ్చిన ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. క్లయింట్ల నుండి వచ్చిన డబ్బును కంపెనీ ఖాతాలో జమ చేయకుండా BD15,000లను తమ ఉద్యోగి సొంతానికి వాడుకున్నాడని కంపెనీ కోర్టులో దావా వేసింది. కానీ ఈ సంఘటనకు ముందు సదరు ఉద్యోగికి కంపెనీ యజమానికి గతంలో వివాదాలు ఉన్నాయని పేర్కొంటూ ఉద్యోగి న్యాయవాది దావాను కోర్టులో వ్యతిరేకించారు.తన లేబర్ బకాయిలను అభ్యర్థిస్తూ లేబర్ కేసును దాఖలు చేశాడని , వేతనాలు ఆలస్యమైనందుకు BD 1,653.333 లను ఉద్యోగికి చెల్లించాలని కంపెనీ యజమానిని లేబర్ కోర్టు గతంలో ఆదేశించిందని న్యాయవాది వెల్లడించారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి యజమాని ఇప్పుడు తన క్లయింట్ అయినా ఉద్యోగిపై తప్పుడు ఆరోపణలు చేసాడని కోర్టులో వాదించారు. దావాను విచారించిన కోర్టు ఉద్యోగి అపరాధానికి ఖచ్చితమైన రుజువులు లేకపోవడంతో కేసును కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







