తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు

- May 01, 2016 , by Maagulf
తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు

తెలుగు రాష్ట్రాలపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఒక పక్క ఎండ తీవ్రత రోజు రోజుకీ అధికమవుతుంటే మరోపక్క వడగాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అసాధారణ ఎండలు, వడగాలుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వడగాల్పుల కారణంగా గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, పలు చోట్ల రాత్రి పూట సగటు ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com