అబుధాబి-కేరళ ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- February 03, 2023
అబుధాబి: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది.విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుధాబి నుంచి కేరళలోని కాలికట్ (కోజికోడ్)కు బయల్దేరింది. టేకాఫ్ అయిన విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి అబుధాబి విమానాశ్రయంలో సుక్షితంగా ల్యాండ్ చేశారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







