అబుధాబి-కేరళ ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- February 03, 2023
అబుధాబి: ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది.విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుధాబి నుంచి కేరళలోని కాలికట్ (కోజికోడ్)కు బయల్దేరింది. టేకాఫ్ అయిన విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.
అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి అబుధాబి విమానాశ్రయంలో సుక్షితంగా ల్యాండ్ చేశారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









