పోలీసుస్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు అందించనున్న మహారాష్ట్ర ప్రభుత్వం
- May 01, 2016
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లులో ఇక నుంచి ఫ్రీ వైఫై సదుపాయం కల్పించనున్నారు. ముంబయి, థానే, నవీ ముంబయిలోని పోలీస్ స్టేషన్లులో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ జాయిస్టర్ వెల్లడించింది. ఇప్పటికే గత నెల మార్చి నుంచి థానేలోని జిల్లా కమిషనరేట్తోపాటు 33 స్టేషన్లులో ఈ సదుపాయాన్ని అమలు చేస్తున్నట్లు జాయిస్టర్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పిస్తామన్న ప్రతిపాదనను ఆమోదం తెలిపినట్టు అడిషనల్ డీజీపీ వీవీ లక్ష్మినారాయణ తెలిపారు.
అన్ని స్టేషన్లులో ఉచిత వైఫై సదుపాయం ఉండటం వల్ల అధికారులకు ఎంతో ఉపయోగపడుతుందని.. త్వరలోనే ముంబయి, నవీ ముంబయిలో ప్రాంతాల్లో ఈ సర్వీసును అమలు చేసే ఆలోచన చేస్తామని డీజీపీ అన్నారు. మరి కొన్ని వారాల్లో అన్ని పోలీస్ ట్రైనింగ్ కేంద్రాల్లోను ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. జాయిస్టర్ ఇప్పటికే ముంబయి, థానే ఆర్టీవో ప్రధాన కార్యాలయం, మరోల్లోని పోలీస్ శిక్షణా కేంద్రం, 21 ప్రభుత్వ కార్యాలయాలు, 15 కళాశాలు, నాలుగు హాస్పిటల్స్, మూడు బస్స్టేషన్లులో ఉచిత వైఫై సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







