ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి..

- February 08, 2023 , by Maagulf
ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి..

తెలంగాణలో పనిచేస్తున్న 2009వ బ్యాచ్ చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా పదోన్నతి లభించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల (బుధవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఐపీఎస్ అధికారులైన అంబర్ కిషోర్ జా,రెమా రాజేశ్వరి, ఎల్ ఎస్ చౌహన్, నారాయణ నాయక్, పరిమళ హన, రంగారెడ్డి ఇక మీదట డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతిపై పనిచేయనున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) గా ఉన్న రేమ రాజేశ్వరిని తిరిగి అక్కడే నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com