టర్కీ, సిరియాలో రెస్క్యూ ఆపరేషన్.. ప్రాణాలతో బయటపడ్డ పలువురు
- February 13, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం అనంతరం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆరు రోజుల తర్వాత ఆదివారం శిథిలాల నుండి మరింత మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరోవపు రెండు దేశాలలో మృతుల సంఖ్య 28వేలు దాటింది. 1939 తర్వాత టర్కీలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదేనని టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని ఆగ్నేయ ప్రావిన్స్ హటేలో రొమేనియన్ రెస్క్యూ టీమ్ ముస్తఫా అనే 35 ఏళ్ల వ్యక్తిని ఒక భవనం నుండి శిధిలాల నుంచి 149 గంటల తర్వాత సజీవంగా రక్షించింది.అలాగే సిరియా హటేలో ధ్వంసమైన భవనం శిథిలాల నుండి 12 ఏళ్ల బాలికను రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. ఇదిలా ఉండగా కొన్ని వారాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలను పున:ప్రారంభిస్తామని అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ఈ భూకంపం ఈ శతాబ్దంలో ప్రపంచంలోని ఏడవ అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంగా నిపుణులు చెబుతున్నారు. 2003లో ఇరాన్లో సంభవించిన భూకంపం కారణంగా 31వేల మందికిపైగా మరణించారు.
తాజా వార్తలు
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..







