టర్కీ, సిరియాలో రెస్క్యూ ఆపరేషన్.. ప్రాణాలతో బయటపడ్డ పలువురు
- February 13, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం అనంతరం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆరు రోజుల తర్వాత ఆదివారం శిథిలాల నుండి మరింత మంది ప్రాణాలతో బయటపడ్డారు. మరోవపు రెండు దేశాలలో మృతుల సంఖ్య 28వేలు దాటింది. 1939 తర్వాత టర్కీలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదేనని టర్కీ అధికారులు చెబుతున్నారు. టర్కీలోని ఆగ్నేయ ప్రావిన్స్ హటేలో రొమేనియన్ రెస్క్యూ టీమ్ ముస్తఫా అనే 35 ఏళ్ల వ్యక్తిని ఒక భవనం నుండి శిధిలాల నుంచి 149 గంటల తర్వాత సజీవంగా రక్షించింది.అలాగే సిరియా హటేలో ధ్వంసమైన భవనం శిథిలాల నుండి 12 ఏళ్ల బాలికను రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. ఇదిలా ఉండగా కొన్ని వారాల్లో పునర్నిర్మాణ కార్యక్రమాలను పున:ప్రారంభిస్తామని అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ఈ భూకంపం ఈ శతాబ్దంలో ప్రపంచంలోని ఏడవ అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంగా నిపుణులు చెబుతున్నారు. 2003లో ఇరాన్లో సంభవించిన భూకంపం కారణంగా 31వేల మందికిపైగా మరణించారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







