'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పురస్కారం మోహన్‌బాబుకు ..

- May 02, 2016 , by Maagulf
'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పురస్కారం మోహన్‌బాబుకు ..

మే 4.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏటా శ్రుతిలయ ఆర్ట్స్‌ అకాడమీ 'దాసరి - శ్రుతిలయ స్వర్ణకంకణం' పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఆ గౌరవాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు అందుకోనున్నారు. ''ఈ నెల 5న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో మోహన్‌బాబు గారికి స్వర్ణకంకణం ప్రదానం చేయనున్నాం. ఈ కార్యక్రమంలో దాసరితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మొహమూద్‌ అలీ, నందమూరి బాలకృష్ణ, శత్రుఘ్నసిన్హా, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొంటార''ని అవార్డు కమిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com