కొత్త సినిమా ప్రకటించిన యువ హీరో తనిష్
- February 16, 2023
హైదరాబాద్: బాల నటుడిగా అనేక చిత్రాల్లో నటించి, అనంతరం హీరోగా మారాడు తనిష్. నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు.
ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్నాడు. తాజాగా తనిష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘కేసీపీడీ (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్)’ పేరుతో ఈ సినిమా తెరకెక్కున్నట్లు వెల్లడించాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.వేద ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై, గోదావరి ఆంధ్రా రెస్టారంట్ దుబాయ్ వారి సహకారంతో కార్తీక్ రెడ్డి, వరుణ్ దగ్గుబాటి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
గౌతమ్ మన్నవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండగా శుభశ్రీ రాయగురు, దివ్యా దిచోల్కర్, ప్రియాంక నిర్వాణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా, ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే సమ్మర్లోనే చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









