కొత్త సినిమా ప్రకటించిన యువ హీరో తనిష్
- February 16, 2023
హైదరాబాద్: బాల నటుడిగా అనేక చిత్రాల్లో నటించి, అనంతరం హీరోగా మారాడు తనిష్. నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు.
ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్నాడు. తాజాగా తనిష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘కేసీపీడీ (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్)’ పేరుతో ఈ సినిమా తెరకెక్కున్నట్లు వెల్లడించాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.వేద ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై, గోదావరి ఆంధ్రా రెస్టారంట్ దుబాయ్ వారి సహకారంతో కార్తీక్ రెడ్డి, వరుణ్ దగ్గుబాటి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
గౌతమ్ మన్నవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండగా శుభశ్రీ రాయగురు, దివ్యా దిచోల్కర్, ప్రియాంక నిర్వాణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా, ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే సమ్మర్లోనే చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







