కొత్త సినిమా ప్రకటించిన యువ హీరో తనిష్
- February 16, 2023
హైదరాబాద్: బాల నటుడిగా అనేక చిత్రాల్లో నటించి, అనంతరం హీరోగా మారాడు తనిష్. నచ్చావులే చిత్రంతో కథానాయకుడిగా మారిన తనిష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ‘రైడ్’ వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా చేశాడు.
ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ, ప్రేక్షుకుల్ని అలరిస్తున్నాడు. తాజాగా తనిష్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. ‘కేసీపీడీ (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్)’ పేరుతో ఈ సినిమా తెరకెక్కున్నట్లు వెల్లడించాడు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.వేద ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై, గోదావరి ఆంధ్రా రెస్టారంట్ దుబాయ్ వారి సహకారంతో కార్తీక్ రెడ్డి, వరుణ్ దగ్గుబాటి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
గౌతమ్ మన్నవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండగా శుభశ్రీ రాయగురు, దివ్యా దిచోల్కర్, ప్రియాంక నిర్వాణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా, ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, వచ్చే సమ్మర్లోనే చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







