భారత్ దేశం లో రంజాన్ దీక్షలు ఆరంభం
- June 19, 2015
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ముస్లిం సోదరులు శుక్రవారం తెల్లవారు జామున సహర్తో ఉపవాస దీక్షలు చేపట్టారు. మసీదులు కిటకిటలాడాయి. తొలిరోజు శుక్రవారం కావడంతో హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రాత్మక మక్కా మసీదులో పెద్ద ఎత్తున సామూహిక ప్రార్థనలు జరిగాయి. అనంతరం మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యౌముల్ ఖురాన్ జల్సాలో చార్మినార్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. సాయంత్రం ఇఫ్తార్ విందులతో దీక్షలను విరమణ చేశారు. అనంతరం దీక్షాపరులు పెద్ద ఎత్తున హలీంలను ఆరగించారు. రాత్రి తొమ్మిది గంటల అనంతరం ప్రత్యేక తరావీ నమాజ్లతో మసీదులు కిటకటలాడాయి. నగరంలోని పాతబస్తీలో ఎక్కడ చూసినా రంజాన్ సందడి కనిపించింది. వ్యాపార సంస్థలన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా మారాయి. కన్నులు మిరుమిట్లు గొలిపే విధంగా దీపకాంతులు వెదజల్లాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







