‘ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్’ను సందర్శించిన యూఏఈ అధ్యక్షుడు
- February 21, 2023
అబుధాబి: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం అబుధాబిలో జరిగిన ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ (ఐడెక్స్) 16వ ఎడిషన్, ఏడవ నేవల్ డిఫెన్స్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ (నవ్డెక్స్)ని సందర్శించారు. రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో అబుధాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (అడ్నెక్)లో షేక్ మొహమ్మద్ ఆధ్వర్యంలో ఈ ఐదు రోజుల డిఫెన్స్ ఎగ్జిబిషన్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. యూఏఈ అధ్యక్షుడు అనేక జాతీయ, అంతర్జాతీయ పెవిలియన్లను సందర్శించారు. తాజా సైనిక ఉత్పత్తులు, పరికరాలు, ప్రదర్శనలో ఉన్న వినూత్న వ్యవస్థలను పరిశీలిస్తూ రక్షణ నిపుణులతో వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూఏఈ ప్రెసిడెంట్ వెంట పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!









