టర్కీ నుండి బయలుదేరిన సౌదీ రెస్క్యూ టీమ్

- February 24, 2023 , by Maagulf
టర్కీ నుండి బయలుదేరిన సౌదీ రెస్క్యూ టీమ్

అంకారా : భూకంపం బాధితుల కోసం సేవలు అందించిన సౌదీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రెండు వారాల తర్వాత టర్కీ నుంచి బయలుదేరింది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా సౌదీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. టర్కీలో భూకంపం కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడంలో బృందం విజయం సాధించింది. ఈ భూకంపంలో 43,000 మందికి పైగా మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు.

జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్‌కు అనుబంధంగా ఉన్న బృందంలో సైనికులు, వైద్యులు, మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, K9 సూపర్‌వైజర్లు, ఇంజనీర్లు, పారామెడిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ టెక్నీషియన్‌లతో పాటు సెక్యూరిటీ మరియు సేఫ్టీ స్పెషలిస్ట్‌లు కూడా ఉన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com