తీవ్రవాద జాబితాలో ముగ్గురు వ్యక్తులు, సంస్థను చేర్చిన యూఏఈ
- February 25, 2023
యూఏఈ: స్థానిక తీవ్రవాద జాబితాలో కొత్తగా ముగ్గురు వ్యక్తులు, ఓ సంస్థను యూఏఈ చేర్చింది. ఈ మేరకు యూఏఈ కేబినెట్ 2023లో 9వ రిజల్యూషన్ను జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు, సంస్థల (స్థానిక తీవ్రవాద జాబితా) ఆమోదించబడిన జాబితాలో 3 వ్యక్తులు మరియు 1 ఎంటిటీని కొత్తగా చేర్చింది. తీవ్రవాదం, దాని సంబంధిత కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేసే నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకోవడం, విచ్ఛిన్నం చేయడం తమ లక్ష్యమని యూఏఈ స్పష్టం చేసింది. రెగ్యులేటరీ అధికారులు అమలులో ఉన్న చట్టాల ప్రకారం 24 గంటలలోపు సంబంధిత వ్యక్తులు, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక తీవ్రవాద జాబితాలో కొత్తగా హసన్ అహ్మద్ మౌకల్లెద్, రాణి హసన్ మౌకల్లెద్, రేయాన్ హసన్ మౌకల్లెద్ అనే వ్యక్తులతోపాటు CTEX ఎక్స్ఛేంజ్ అనే సంస్థను చేర్చారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







