తీవ్రవాద జాబితాలో ముగ్గురు వ్యక్తులు, సంస్థను చేర్చిన యూఏఈ
- February 25, 2023
యూఏఈ: స్థానిక తీవ్రవాద జాబితాలో కొత్తగా ముగ్గురు వ్యక్తులు, ఓ సంస్థను యూఏఈ చేర్చింది. ఈ మేరకు యూఏఈ కేబినెట్ 2023లో 9వ రిజల్యూషన్ను జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వ్యక్తులు, సంస్థల (స్థానిక తీవ్రవాద జాబితా) ఆమోదించబడిన జాబితాలో 3 వ్యక్తులు మరియు 1 ఎంటిటీని కొత్తగా చేర్చింది. తీవ్రవాదం, దాని సంబంధిత కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేసే నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకోవడం, విచ్ఛిన్నం చేయడం తమ లక్ష్యమని యూఏఈ స్పష్టం చేసింది. రెగ్యులేటరీ అధికారులు అమలులో ఉన్న చట్టాల ప్రకారం 24 గంటలలోపు సంబంధిత వ్యక్తులు, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక తీవ్రవాద జాబితాలో కొత్తగా హసన్ అహ్మద్ మౌకల్లెద్, రాణి హసన్ మౌకల్లెద్, రేయాన్ హసన్ మౌకల్లెద్ అనే వ్యక్తులతోపాటు CTEX ఎక్స్ఛేంజ్ అనే సంస్థను చేర్చారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







