ఎయిర్ ఇండియాలో భారీగా ఉద్యోగ నియామకాలు
- February 25, 2023
న్యూఢిల్లీ: భారత కంపెనీ ఎయిరిండియా శుభవార్త చెప్పింది. టాటా గ్రూప్.. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన తర్వత సేవలను భారీగా విస్తరించే పనిలో పడింది. తాజాగా 470 విమానాల కొనుగోలుకు ఎయిర్బస్, బోయింగ్ సంస్థలతో భారీ డీల్ కుదుర్చుకున్న టాటా.. ఇప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. కేబిన్ సిబ్బంది, పైలట్లు కలుపుకొని మొత్తం 5,100 మందిని తీసుకోనున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది.
అంతర్జాతీయ సేవలను విస్తరించే నేపథ్యంలో ఉద్యోగుల నియామకం ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. 5,100 ఉద్యోగాల్లో4,200 మందిని ట్రైనీ కేబిన్ సిబ్బందిగా, 900 మంది పైలట్లను తీసుకోనున్నారు. వాళ్లకు 15 వారాలు శిక్షణ ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







