కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత
- February 26, 2023
తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకులుగా పేరొందిన కె విశ్వనాథ్ ఫిబ్రవరి 2న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ బాధ నుంచి బయటపడుతుండగానే మరో విషాద వార్త షాక్ ఇచ్చింది. కళాతపస్వి కన్నుమూసి నెల రోజులైనా గడవక ముందే ఆయన సతీమణి జయలక్ష్మి గుండె పోటుతో మరణించారు. కళాత్మక సినిమాలతో తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన కె విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచిపెట్టిన 24 రోజులకే ఆయన భార్య కూడా మరణించడం కుటుంబ సభ్యులను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. ఆవిడ వయసు 86 ఏళ్లు కాగా.. అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు జయలక్ష్మి.
కళాతపస్వి కె విశ్వనాథ్ చనిపోయే నాటికే జయలక్ష్మి మంచానికి పరిమితమై ఉన్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 6.15 గం.కు మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. విశ్వనాధ్ మాదిరే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా నిద్రలోనే మరణించారని తెలుస్తోంది. కె.విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా.. పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే ఆయన ఇండియాకు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









