రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్ అయిన సేల్స్ ఉమన్
- March 02, 2023
యూఏఈ: మహ్జూజ్ డ్రాలో ఫిలిప్పీన్స్ సేల్స్ ఉమన్ 10 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. 40 ఏళ్ల ఫిలిపినా సేల్స్ ప్రమోటర్ అర్లీన్ కష్ట సమయాల్లో స్నేహితుల నుండి Dh10 నుండి Dh100 వరకు అప్పుగా తీసుకునేవారు. అలాంటి అర్లీన్ మహ్జూజ్ (Mahzooz) ఇటీవల నిర్వహించిన సూపర్ సాటర్డే డ్రాస్లో భారీ Dh10-మిలియన్ గ్రాండ్ ప్రైజ్ని గెలుచుకొని రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్ అయ్యారు. గత12 సంవత్సరాలుగా అబుధాబిలో నివసిస్తున్న అర్లీన్ ఒక సంవత్సరం నుండి మహ్జూజ్లో పాల్గొంటోంది. ప్రతి వారం కచ్చితంగా ఒక టిక్కెట్ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం రాత్రికి రాత్రే మల్టీ-మిలియనీర్గా మారిన రెండవ ఫిలిపినో అర్లీన్. జనవరి చివరలో ఫిలిపినో ప్రవాసుడు స్టోర్ మేనేజర్ రస్సెల్ రేయెస్ టుయాజోన్( 34) రాఫిల్ డ్రాలో 15 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నారు. మహ్జూజ్ ప్రకారం.. 2021లో మహ్జూజ్ డ్రా ప్రారంభించినప్పటి నుండి అర్లీన్ తో సహా ఐదుగురు ఫిలిపినోలు బహుళ-మిలియనీర్లు అయ్యారు. ‘‘మహ్జూజ్లో పాల్గొనేవారిలో ఫిలిపినోలు రెండవ అతిపెద్ద సమూహం. మొత్తం 50,000 మంది ఫిలిపినోలు Dh350 నుండి Dh10 మిలియన్ల వరకు మొత్తం Dh62 మిలియన్ల వరకు బహుమతులు గెలుచుకున్నారు." అని మహ్జూజ్ మేనేజింగ్ ఆపరేటర్ ఎవింగ్స్ సీఈఓ ఫరీద్ సామ్జీ వెల్లడించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









