ఏపీలో గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్
- March 03, 2023
విశాఖపట్నం: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది. GIS 2023 కు విశాఖపట్నం సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.45గంటలకు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ మేరకు సిఎం జగన్ జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించారు. సమ్మిట్కు హాజరైన కార్పొరేట్ దిగ్గజాలకు స్వాగతం పలికారు సీఎం జగన్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి సాదర స్వాగతం పలికారు.
జీఐఎస్ ప్రారంభ సెషన్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కీలక ప్రసంగాలు చేస్తారు. భారతదేశం నుంచి సమ్మిట్లో పాల్గొనే పారిశ్రామిక దిగ్గజాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ KM బిర్లా, శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, JSW గ్రూప్ సజ్జన్ చైర్మన్ జిందాల్, బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ , CEO సంజీవ్ బజాజ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ పాల్గొననున్నారు.
జీఐఎస్ సమ్మిట్లో 46 మంది దౌత్యవేత్తలు, 30 మంది గ్లోబల్ బిజినెస్ లీడర్లు పాల్గొననున్నారు. 25 దేశాలకు చెందిన 14వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









