‘దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో’ను సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్
- March 03, 2023
యూఏఈ: మిడిల్ ఈస్ట్ అతిపెద్ద సముద్ర యాత్ర అయిన దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో యొక్క 29వ ఎడిషన్ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సందర్శించారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 5 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్.. ప్రదర్శించిన అత్యంత ప్రముఖమైన పడవలు, ఓడల గురించి అడిగి తెలుసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2023 ఎడిషన్ కోసం ప్రపంచంలోని ప్రముఖ సముద్ర బ్రాండ్ల నుండి 175 పడవలు, ఓడలను ఇందులో ప్రదర్శించారు. 60 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ ఎగ్జిబిటింగ్ కంపెనీలు, బ్రాండ్లను కలిగి ఉంది. ఐదు రోజులలో 30,000 మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!







