‘దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో’ను సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్
- March 03, 2023
యూఏఈ: మిడిల్ ఈస్ట్ అతిపెద్ద సముద్ర యాత్ర అయిన దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో యొక్క 29వ ఎడిషన్ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సందర్శించారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 5 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్.. ప్రదర్శించిన అత్యంత ప్రముఖమైన పడవలు, ఓడల గురించి అడిగి తెలుసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2023 ఎడిషన్ కోసం ప్రపంచంలోని ప్రముఖ సముద్ర బ్రాండ్ల నుండి 175 పడవలు, ఓడలను ఇందులో ప్రదర్శించారు. 60 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ ఎగ్జిబిటింగ్ కంపెనీలు, బ్రాండ్లను కలిగి ఉంది. ఐదు రోజులలో 30,000 మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!









