కువైట్ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు
- March 04, 2023
కువైట్: దేశంలోని విద్యా ప్రక్రియకు సంబంధించిన సంస్థల సహకారంతో విద్యా వ్యవస్థకు విఘాతం కలిగించే ప్రతికూల విషయాలను ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ అనేక చర్యలను తీసుకుంటుందని విద్యా మంత్రి, ఉన్నత విద్య- శాస్త్రీయ పరిశోధన మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వానీ తెలిపారు. పరీక్షల జాయింట్ హయ్యర్ కమిటీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత అల్-అద్వానీ మాట్లాడారు. విద్యను అభివృద్ధి చేయడం, విద్యా వ్యవస్థలో మార్పులే లక్ష్యంగా తన వ్యూహాన్ని అమలు చేయడంలో మంత్రిత్వ శాఖ తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. సంబంధిత రాష్ట్ర సంస్థల సహకారంతో పరీక్షల కోసం జాయింట్ హయ్యర్ కమిటీ తీసుకున్న సిఫార్సులు, నిర్ణయాలకు అనుగుణంగా రెండవ సెమిస్టర్ పరీక్షలకు సన్నాహకంగా ప్రతికూల విషయాలను పరిష్కరించడానికి ఎగ్జిక్యూటివ్ ప్రొసీజర్ల సమగ్ర కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగించే అనుమానాస్పద వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యాంటీ-క్రైమ్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి ప్రచురించినందుకు బాధ్యులైన వారిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు అల్-అద్వానీ వివరించారు. ఈ సందర్భంగా సంస్కరణలు, విద్యాపరమైన పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందన్నారు. విద్యా రంగంలో కువైట్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపడమే తమ లక్ష్యమన్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







