నైజీరియా నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం..12 మంది మృతి
- March 04, 2023
నైజీరియా: నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. పలు వాహనాలు దగ్ధం అయ్యాయి. ఆయిల్ రిఫైనరీ కర్మాగారానికి సమీపంలో పేలుడు సంభవించింది. ఆయిల్ పైప్ లైన్ కు రంధ్రం ఏర్పడి మంటలు చెలరేగాయి. గంటల తరబడి ఎగిసిపడిన మంటల ధాటికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మెర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో భారీ పేలుడు సంభవించింది.
భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత ఇది అనేక పేలుళ్లకు కారణమైంది. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటినా ఖాళీ చేయించారు. భారీ అగ్ని ప్రమాదంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







