దమ్మామ్లో 13 మంది ప్రవాసుల అరెస్ట్
- March 05, 2023
సౌదీ: తూర్పు దమ్మామ్ నగరంలో మోసానికి పాల్పడిన 13 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా పోలీసులు తెలిపారు. వీరందరూ పాకిస్తాన్ కు చెందిన వారని, బ్యాంక్ కార్డ్లు సరిగా పని చేయడంలేదని.. వాటిని అప్డేట్ చేయవలసి ఉంటుందని పేర్కొంటూ తప్పుడు మెసేజ్ లను పంపడం ద్వారా అనేక మంది వ్యక్తులను ఈ ముఠా మోసగించారని పోలీసులు వెల్లడించారు. సౌదీ అరేబియా వెలుపల నివసిస్తున్న పాకిస్తానీల సహకారంతో బాధితుల ఖాతాల నుండి డబ్బును విత్డ్రా చేసుకునేవారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 28 మొబైల్ ఫోన్లు, 30 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ నిందితులను అరెస్టు చేసిన తర్వాత వారి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సౌదీ చట్టం ప్రకారం, మోసానికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు గరిష్టంగా SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జనవరిలో సౌదీ అరేబియా ఆర్థిక మోసం కేసులను నిర్వహించడానికి ప్రాసిక్యూషన్ బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







