దమ్మామ్లో 13 మంది ప్రవాసుల అరెస్ట్
- March 05, 2023
సౌదీ: తూర్పు దమ్మామ్ నగరంలో మోసానికి పాల్పడిన 13 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా పోలీసులు తెలిపారు. వీరందరూ పాకిస్తాన్ కు చెందిన వారని, బ్యాంక్ కార్డ్లు సరిగా పని చేయడంలేదని.. వాటిని అప్డేట్ చేయవలసి ఉంటుందని పేర్కొంటూ తప్పుడు మెసేజ్ లను పంపడం ద్వారా అనేక మంది వ్యక్తులను ఈ ముఠా మోసగించారని పోలీసులు వెల్లడించారు. సౌదీ అరేబియా వెలుపల నివసిస్తున్న పాకిస్తానీల సహకారంతో బాధితుల ఖాతాల నుండి డబ్బును విత్డ్రా చేసుకునేవారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 28 మొబైల్ ఫోన్లు, 30 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ నిందితులను అరెస్టు చేసిన తర్వాత వారి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సౌదీ చట్టం ప్రకారం, మోసానికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు గరిష్టంగా SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జనవరిలో సౌదీ అరేబియా ఆర్థిక మోసం కేసులను నిర్వహించడానికి ప్రాసిక్యూషన్ బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







