దమ్మామ్లో 13 మంది ప్రవాసుల అరెస్ట్
- March 05, 2023సౌదీ: తూర్పు దమ్మామ్ నగరంలో మోసానికి పాల్పడిన 13 మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా పోలీసులు తెలిపారు. వీరందరూ పాకిస్తాన్ కు చెందిన వారని, బ్యాంక్ కార్డ్లు సరిగా పని చేయడంలేదని.. వాటిని అప్డేట్ చేయవలసి ఉంటుందని పేర్కొంటూ తప్పుడు మెసేజ్ లను పంపడం ద్వారా అనేక మంది వ్యక్తులను ఈ ముఠా మోసగించారని పోలీసులు వెల్లడించారు. సౌదీ అరేబియా వెలుపల నివసిస్తున్న పాకిస్తానీల సహకారంతో బాధితుల ఖాతాల నుండి డబ్బును విత్డ్రా చేసుకునేవారని చెప్పారు. నిందితుల వద్ద నుంచి 28 మొబైల్ ఫోన్లు, 30 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ నిందితులను అరెస్టు చేసిన తర్వాత వారి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సౌదీ చట్టం ప్రకారం, మోసానికి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు గరిష్టంగా SR 5 మిలియన్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జనవరిలో సౌదీ అరేబియా ఆర్థిక మోసం కేసులను నిర్వహించడానికి ప్రాసిక్యూషన్ బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..