3 బిలియన్ దిర్హామ్లతో దుబాయ్లో ల్యాండ్ మార్క్ స్టేడియం
- May 04, 2016
60,000 మంది వీక్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మొహమ్మద్ బిన్ స్టేడియం ఇన్నోవేటివ్ మోడల్ పైలట్ డిజైన్ వివరాల్ని వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ తెలియజేశారు. 3 బిలియన్ దిర్హామ్లు ఈ స్టేడియం నిర్మాణానికి ఖర్చు కానుంది. దుబాయ్లోని అల్ వీర్ ఏరియాలో దుబాయ్ స్పోర్ట్స్ క్లబ్లో ఈ స్టేడియం నిర్మితం కానుంది. దుబాయ్ స్పోర్ట్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ మట్టర్ అల్ తయెర్ స్టేడియంకి సంబంధించిన వివరాల్ని, షేక్ మొహ్మద్ పర్యటన సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ స్టేడియం దుబాయ్కి ఓ ల్యాండ్ మార్క్ అవుతుందని ఆయన చెప్పారు. 60,000 మంది వీక్షకులు, 8941 వీఐపీల కోసం ఏర్పాట్లు, అలాగే టెర్రాస్ కింద 6688 సీట్లను ఈ స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ హాల్స్ని కూడా పొందుపర్చారు. అంతర్జాతీయ స్థాయిలో పలువురు డిజైనర్లతో ఈ స్టేడియం నిర్మాణాన్ని చేపడుతున్నారు. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని షేక్ మహమ్మద్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









