3 బిలియన్‌ దిర్హామ్‌లతో దుబాయ్‌లో ల్యాండ్‌ మార్క్‌ స్టేడియం

- May 04, 2016 , by Maagulf
3 బిలియన్‌ దిర్హామ్‌లతో దుబాయ్‌లో ల్యాండ్‌ మార్క్‌ స్టేడియం

60,000 మంది వీక్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మొహమ్మద్‌ బిన్‌ స్టేడియం ఇన్నోవేటివ్‌ మోడల్‌ పైలట్‌ డిజైన్‌ వివరాల్ని వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ది యూఏఈ మరియు రూలర్‌ ఆఫ్‌ దుబాయ్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ తెలియజేశారు. 3 బిలియన్‌ దిర్హామ్‌లు ఈ స్టేడియం నిర్మాణానికి ఖర్చు కానుంది. దుబాయ్‌లోని అల్‌ వీర్‌ ఏరియాలో దుబాయ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఈ స్టేడియం నిర్మితం కానుంది. దుబాయ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మట్టర్‌ అల్‌ తయెర్‌ స్టేడియంకి సంబంధించిన వివరాల్ని, షేక్‌ మొహ్మద్‌ పర్యటన సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ స్టేడియం దుబాయ్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌ అవుతుందని ఆయన చెప్పారు. 60,000 మంది వీక్షకులు, 8941 వీఐపీల కోసం ఏర్పాట్లు, అలాగే టెర్రాస్‌ కింద 6688 సీట్లను ఈ స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. కాన్ఫరెన్స్‌ ఎగ్జిబిషన్‌ హాల్స్‌ని కూడా పొందుపర్చారు. అంతర్జాతీయ స్థాయిలో పలువురు డిజైనర్లతో ఈ స్టేడియం నిర్మాణాన్ని చేపడుతున్నారు. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని షేక్‌ మహమ్మద్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com