క్రిప్టో కరెన్సీ పై భారత్ కీలక నిర్ణయం
- March 09, 2023
న్యూ ఢిల్లీ: అవినీతి భరతం పట్టేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారు. పెచ్చు మీరుతున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో క్రిప్టో కరెన్సీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ సంపదపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో క్రిప్టో కరెన్సీ రంగానికి మనీలాండరింగ్ చట్టాన్ని వర్తింప చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
క్రిప్టో ట్రేడింగ్, సేఫ్ కీపింగ్ సంబంధిత ఫైనాన్షియల్ సర్వీసెస్ కు యాంటీ మనీ లాండరింగ్ చట్టాన్ని వర్తింప చేసినట్లు తెలిపింది. క్రిప్టో కరెన్సీ రంగంపై గతేడాది కఠినమైన పన్ను నిబంధనలను అమలు చేసింది. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లెవీని విధించింది. ప్రభుత్వ నిబంధనలతోపాటు అంతర్జాతీయంగా డిజిటల్ అసెట్స్ దెబ్బ తినడంతో మన దేశంలో క్రిస్టో ట్రేడింగ్ పరిణామం తగ్గింది.
బ్యాంకులు, స్టాక్ బ్రోకర్లు యాంటీ మనీ లాండరింగ్ ప్రమాణాలను పాటిస్తారు.ఇదే విధంగా డిజిటల్ అసెట్స్ ప్లాట్ ఫామ్స్ కూడా ఈ ప్రమాణాలను పాటించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి.భారత ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని అమలు చేయాలంటే పకడ్బంది వ్యూహాన్ని అమలు చేయాల్సిందేనని చెబుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









