సీఎం కేసీఆర్కు అస్వస్థత..
- March 12, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ కడుపు నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఇతర కుటుంబసభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఏఐజి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగా ఉందని నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నారని ఏఐజీ డాక్టర్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి సి.టి, ఎండోస్కోపీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఏఐజీ డాక్టర్లు వెల్లడించారు. గ్యాస్ట్రిక్ సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు వివరించారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







