ఢిల్లీ-దోహా ఇండిగో విమానం: కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్
- March 13, 2023
దోహా: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఇండిగో విమానాన్ని పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ-దోహా విమానం 6E-1736 ఇండిగో ఎయిర్లైన్స్ విమానాన్ని పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరడంతో సోమవారం తెల్లవారుజామున కరాచీలోని జిన్నా టెర్మినల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 60 ఏళ్ల నైజీరియా పౌరుడిని పరీక్షించిన విమానాశ్రయ వైద్య బృందం మరణించినట్లు ప్రకటించారు. నాలుగు గంటల తర్వాత విమానం దోహా బయలుదేరి వెళ్లింది. "ఇండిగో ఫ్లైట్ 6E-1736, ఢిల్లీ నుండి దోహాకు వెళ్లే క్రమంలో.. విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీకి మళ్లించబడింది. దురదృష్టవశాత్తు, విమానంలో ప్రయాణీకుడు మరణించినట్లు ఎయిర్ పోర్ట్ వైద్య బృందాలు ప్రకటించాయి." అని ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







