ఢిల్లీ-దోహా ఇండిగో విమానం: కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్
- March 13, 2023
దోహా: మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఇండిగో విమానాన్ని పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి మళ్లించారు. ఢిల్లీ-దోహా విమానం 6E-1736 ఇండిగో ఎయిర్లైన్స్ విమానాన్ని పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరడంతో సోమవారం తెల్లవారుజామున కరాచీలోని జిన్నా టెర్మినల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. 60 ఏళ్ల నైజీరియా పౌరుడిని పరీక్షించిన విమానాశ్రయ వైద్య బృందం మరణించినట్లు ప్రకటించారు. నాలుగు గంటల తర్వాత విమానం దోహా బయలుదేరి వెళ్లింది. "ఇండిగో ఫ్లైట్ 6E-1736, ఢిల్లీ నుండి దోహాకు వెళ్లే క్రమంలో.. విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీకి మళ్లించబడింది. దురదృష్టవశాత్తు, విమానంలో ప్రయాణీకుడు మరణించినట్లు ఎయిర్ పోర్ట్ వైద్య బృందాలు ప్రకటించాయి." అని ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది
తాజా వార్తలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!









