మల్టీ స్టారర్ సినిమా తీయనున్న శశి..!
- May 05, 2016
వైవిధ్య కథా చిత్రాల దర్శకుడిగా పేరొందినారు శశి. ఆయన చిన్న గ్యాప్ తరువాత విజయ్ఆంటోని కథానాయకుడిగా రూపొందించిన చిత్రం పిచ్చైక్కారన్. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పిచ్చైక్కారన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతను, పంపిణీదారుల్ని కోటీశ్వరుల్ని చేసింది. దీంతో దర్శకుడు శశికి డిమాండ్ పెరిగింది. పలువురు ప్రముఖ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ముందుకొస్తున్నారు.
కాగా శశి తన తాజా చిత్రానికి నటుడు మాధవన్, జీవీ.ప్రకాశ్కుమార్లను ఎంచుకోవడం విశేషం. అదే విధంగా శశి దర్శకత్వంలో చిత్రాలను నిర్మించడానికి పలువురు నిర్మాతలు సిద్ధం అయినా ఆ అడ్వాంటేజ్ను శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తీసుకుంది. శశి దర్శకత్వంలో మాధవన్, జీవీ.ప్రకాశ్కుమార్ కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఇందులో నటించే హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపక జరుగుతోందని తెలిసింది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ ఇంతకు ముందు డిమాంటీ కాలనీ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









