దోహాలో కైట్ ఫెస్టివల్ సందడి
- March 16, 2023
దోహా: దోహాలో కైట్ ఫెస్టివల్ సందడి ప్రారంభమైంది. వివిధ రకాల రంగులు, ఆకారాలు, పరిమాణాలు, డిజైన్లలో రూపొందించిన గాలిపటాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డంబో పిల్ల ఏనుగు, చార్లీ చాప్లిన్, డుగాంగ్, పెంగ్విన్, స్టింగ్రే వంటి విభిన్న జంతువుల ఆకారాల గాలిపటాలు పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సేఫ్ ఫ్లైట్ సొల్యూషన్స్ సీఈ, ఖతార్ కైట్ ఫెస్టివల్ నిర్వాహకుడు హసన్ అల్ మౌసావి మాట్లాడుతూ.. ఫెస్టివల్ మొదటి ఎడిషన్ కోసం 40 మందికి పైగా ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ప్రపంచం నలుమూలల నుండి దోహాకు వచ్చారని చెప్పారు. జర్మనీ, థాయ్లాండ్, టర్కీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, ఇండోనేషియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ నుండి 16 కంటే ఎక్కువ జట్లు ఈవెంట్ లో పోటీ పడుతున్నాయని తెలిపారు. మూడు రోజులపాటు జరుగనున్న కైట్ ఫెస్టివల్ మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (MIA) పార్క్ హిల్స్లో నిర్వహించబడుతుందన్నారు. మార్చి 16 నుండి 17 వరకు మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు.. మార్చి 18న ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!









