మూడు నెలల్లో 9,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- April 07, 2023
కువైట్ : క్రిమినల్ కేసులు, దుష్ప్రవర్తన కేసులలో ప్రమేయం ఉన్నందున ప్రస్తుత సంవత్సరంలో మార్చి చివరి వరకు వివిధ దేశాలకు చెందిన 9,000 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. బహిష్కరణ వేటు పడిన వారిలో దాదాపు 4,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరణకు గురైన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ఫిలిపినో కమ్యూనిటీ, శ్రీలంక, ఈజిప్షియన్ జాతీయులు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. దాదాపు 700 మంది పురుషులు, మహిళలు ప్రస్తుతం డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారని, వారి విధానాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే 10 రోజుల్లో వారి స్వదేశాలకు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల కారణంగా బహిష్కరణ రేటులో పెరుగుదల నమోదుకాగా, గడువు ముగిసిన రెసిడెన్సీ, కార్మిక చట్ట ఉల్లంఘన కారణంగా బహిష్కరణ రెండవ స్థానంలో ఉందని సదరు ననివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









