మూడు నెలల్లో 9,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- April 07, 2023
కువైట్ : క్రిమినల్ కేసులు, దుష్ప్రవర్తన కేసులలో ప్రమేయం ఉన్నందున ప్రస్తుత సంవత్సరంలో మార్చి చివరి వరకు వివిధ దేశాలకు చెందిన 9,000 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. బహిష్కరణ వేటు పడిన వారిలో దాదాపు 4,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరణకు గురైన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ఫిలిపినో కమ్యూనిటీ, శ్రీలంక, ఈజిప్షియన్ జాతీయులు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. దాదాపు 700 మంది పురుషులు, మహిళలు ప్రస్తుతం డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారని, వారి విధానాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే 10 రోజుల్లో వారి స్వదేశాలకు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల కారణంగా బహిష్కరణ రేటులో పెరుగుదల నమోదుకాగా, గడువు ముగిసిన రెసిడెన్సీ, కార్మిక చట్ట ఉల్లంఘన కారణంగా బహిష్కరణ రెండవ స్థానంలో ఉందని సదరు ననివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







