మూడు నెలల్లో 9,000 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- April 07, 2023
కువైట్ : క్రిమినల్ కేసులు, దుష్ప్రవర్తన కేసులలో ప్రమేయం ఉన్నందున ప్రస్తుత సంవత్సరంలో మార్చి చివరి వరకు వివిధ దేశాలకు చెందిన 9,000 మంది ప్రవాసులను కువైట్ నుండి బహిష్కరించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. బహిష్కరణ వేటు పడిన వారిలో దాదాపు 4,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరణకు గురైన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. ఫిలిపినో కమ్యూనిటీ, శ్రీలంక, ఈజిప్షియన్ జాతీయులు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. దాదాపు 700 మంది పురుషులు, మహిళలు ప్రస్తుతం డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారని, వారి విధానాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే 10 రోజుల్లో వారి స్వదేశాలకు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల కారణంగా బహిష్కరణ రేటులో పెరుగుదల నమోదుకాగా, గడువు ముగిసిన రెసిడెన్సీ, కార్మిక చట్ట ఉల్లంఘన కారణంగా బహిష్కరణ రెండవ స్థానంలో ఉందని సదరు ననివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







