2 బిలియన్లు దాటిన దుబాయ్ మెట్రో రైడర్స్.. షేక్ మహమ్మద్ ఎమోషనల్ ట్వీట్
- April 25, 2023
దుబాయ్: ‘‘మెట్రో లేకుండా దుబాయ్ని ఊహించడం వాస్తవంగా అసాధ్యం. ప్రజా రవాణా వ్యవస్థ 2009 సెప్టెంబర్లో ప్రారంభమైనప్పటి నుండి 2 బిలియన్లకు పైగా నివాసితులు మరియు పర్యాటకులను తీసుకువెళ్లింది. కానీ చాలా మంది అధికారులు దీనిని ప్రారంభించాలనే నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదని మీకు తెలుసా?’’ అని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దుబాయ్ మెట్రోను ప్రారంభించే “ధైర్యమైన నిర్ణయం”తో ఎలా ముందుకు వెళ్లామో అందులో వివరించారు. సెప్టెంబర్ 2019 దుబాయ్ మెట్రో ప్రారంభించడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను షేక్ మహమ్మద్ గుర్తుచేసుకున్నారు. “నేను రైలు కాక్పిట్ను చూడాలని పట్టుబట్టి మా నాన్నతో కలిసి 1959లో లండన్ని సందర్శించినప్పుడు నాకు 10 సంవత్సరాలు. 50 ఏళ్ల తర్వాత 2009లో దుబాయ్ మెట్రో నిజమైంది. కలలు కనగలిగితే సాధ్యం కానిది ఏదీ లేదు’’ అని తన ట్వీట్ లో షేక్ మహమ్మద్ తెలిపారు. యూఏఈ డిక్షనరీలో ‘అసాధ్యం’ అనే పదం లేదని షేక్ మహ్మద్ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్









