డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించిన సౌదీ అరేబియా..!
- April 28, 2023
రియాద్: డ్రగ్స్పై సౌదీ అరేబియా యుద్ధాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా మాదకద్రవ్యాల వ్యాప్తిని ఎదుర్కోవడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలను విఫలం చేయడమే లక్ష్యంగా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం సందర్భంగా.. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వారు రాజ్యవ్యాప్తంగా అనేక నగరాల్లో వివిధ రకాల డ్రగ్స్ను మార్కెటింగ్ చేస్తూ.. విక్రయిస్తున్నారు. వీరిలో జెడ్డాలో ఒక ప్రవాసుడితో సహా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరు మాదక ద్రవ్యాన్ని వ్యాప్తి చేయడంలో పాలుపంచుకున్నారు. రియాద్ నగరంలో డ్రగ్స్ పిల్స్ ప్రచారం చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. డైరక్టరేట్ అధికారులు హషీష్ చెలామణి చేస్తున్నందుకు జజాన్లో ఇద్దరు వ్యక్తులను.. అసిర్, తూర్పు ప్రావిన్స్, అల్-ఖాసిమ్లలో ఒక్కొక్కరిని అరెస్టు చేశారు. తూర్పు ప్రావిన్స్లో అరెస్టయిన వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా హషీష్ను సర్క్యులేట్ చేస్తూ దొరికిపోయాడు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ సహకారంతో దానిమ్మ పండ్ల రవాణాలో దాచిన 12 మిలియన్లకు పైగా నార్కోటిక్ యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణాను విఫలమైనట్లు GDNC వెల్లడించింది. డైరెక్టరేట్ అన్ని రకాల డ్రగ్స్కు వ్యతిరేకంగా తన ప్రచారాల పద్దతిలో సామాజిక బాధ్యత అంశాన్ని హైలైట్ చేసింది. "రిపోర్ట్ దెమ్" అనే పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉంటే తమకు తెలియజేయాలని కోరింది. డైరెక్టరేట్ డ్రగ్స్ శాపానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారాన్ని నిర్వహించడంలో చురుకుగా ఉంది. "డ్రగ్స్పై యుద్ధం" అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









