వినియోగదారుల హక్కుల ఉల్లంఘన.. 23 మంది వ్యాపారులకు జరిమానా

- April 28, 2023 , by Maagulf
వినియోగదారుల హక్కుల ఉల్లంఘన.. 23 మంది వ్యాపారులకు జరిమానా

బహ్రెయిన్: వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించినందుకు ఇక్కడి వ్యాపారులపై మొత్తం BD11,300 వరకు జరిమానాలను కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. ఈ సంవత్సరం చట్టాలను ఉల్లంఘించినందుకు కోర్టులు 23 మంది వ్యాపారులకు BD100- BD1,000 మధ్య జరిమానా విధించాయి. లోపభూయిష్ట వస్తువులను అమ్మడం, వినియోగదారులకు రీఫండ్ చేయడానికి లేదా సేవలలో లోపాలను భర్తీ చేయడానికి నిరాకరించిన వ్యాపారుల గురించి వినియోగదారుల రక్షణ విభాగం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు 65 నోటిఫికేషన్‌లను జారీ చేసింది. కోర్టులో ఇంకా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నందున జరిమానాలు పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com