అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద మరో పేలుడు
- May 08, 2023
పంజాబ్: పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో ఈ ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్ కు వెళ్లే మార్గంలోని సారాగర్హి సరాయ్ సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ సహా డాగ్ స్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలికి స్వల్పంగా గాయమయింది. ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఉందని అమృత్ సర్ అసిస్టెంట్ డీసీపీ మెహ్తాబ్ సింగ్ తెలిపారు. ఇదే ప్రాంతంలో నిన్న కూడా బాంబు పేలుడు సంభవించింది. నిన్నటి ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







