అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద మరో పేలుడు
- May 08, 2023
పంజాబ్: పంజాబ్ అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం వద్ద ఉన్న హెరిటేజ్ స్ట్రీట్ లో ఈ ఉదయం మరో పేలుడు సంభవించింది. గోల్డెన్ టెంపుల్ కు వెళ్లే మార్గంలోని సారాగర్హి సరాయ్ సమీపంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ సహా డాగ్ స్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కాలికి స్వల్పంగా గాయమయింది. ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ఉందని అమృత్ సర్ అసిస్టెంట్ డీసీపీ మెహ్తాబ్ సింగ్ తెలిపారు. ఇదే ప్రాంతంలో నిన్న కూడా బాంబు పేలుడు సంభవించింది. నిన్నటి ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







