తిరుమలలో భారీ వర్షం
- May 18, 2023
తిరుమల: తిరుమలలో భారీ వర్షం కురిసింది. గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్రవస్థలు పడ్డారు.
అప్పటి వరకు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయిన భక్తులు సేదతీరారు. దాదాపు 30 నిమిషాలపాటు పడిన వర్షంతో.. తిరుమల కొండలపై చల్లని గాలులు వీచాయి. తడిస్తే తడిశాం.. ఎండ నుంచి రిలాక్స్ అయ్యాం అంటూ కొంత మంది భక్తులు వర్షంలో తడుస్తూనే నడుచుకుంటూ గదులకు వెళ్లారు. రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీలపైనే ఎండ తీవ్రత ఉంటుంది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







