ప్రవాస భారతీయురాలికి అరుదైన గౌరవం

- May 11, 2016 , by Maagulf
ప్రవాస భారతీయురాలికి అరుదైన గౌరవం

భారతీయ-అమెరికన్‌ మహిళా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేవతి బాలక్రిష్ణన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె అమెరికాలోని టెక్సాస్‌లో పాట్సీ సొమ్మర్‌ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. విద్యాభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలను కొనియాడుడూ శ్వేతసౌధంలో జరిగే ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆమెను ఘనంగా సత్కరించనున్నారు. 2016 టెక్సాస్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పేరును పొందారు. ప్రస్తుతం రేవతి సొమ్మర్‌ పాఠశాలలో గణితశాస్త్రం బోధిస్తుంది. ఈ పాఠశాలలో ఆమె ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

ఆమె స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. తనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com