ప్రవాస భారతీయురాలికి అరుదైన గౌరవం
- May 11, 2016
భారతీయ-అమెరికన్ మహిళా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేవతి బాలక్రిష్ణన్కు అరుదైన గౌరవం దక్కింది. ఆమె అమెరికాలోని టెక్సాస్లో పాట్సీ సొమ్మర్ ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. విద్యాభివృద్ధికి ఆమె చేస్తున్న సేవలను కొనియాడుడూ శ్వేతసౌధంలో జరిగే ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమెను ఘనంగా సత్కరించనున్నారు. 2016 టెక్సాస్ ఎలిమెంటరీ టీచర్ ఆఫ్ ద ఇయర్ పేరును పొందారు. ప్రస్తుతం రేవతి సొమ్మర్ పాఠశాలలో గణితశాస్త్రం బోధిస్తుంది. ఈ పాఠశాలలో ఆమె ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఆమె స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో డిగ్రీ పట్టా పొందారు. తనకు ఎంతో ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







