జ్యోతిలక్ష్మిపై పుస్తకం ఆవిష్కరణ
- May 11, 2016
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి కథానాయికగా నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'. ఈ చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని రచయిత్రి మంగళ గౌరి కేవలం మూడు రోజుల్లో జ్యోతిలక్ష్మి అనే పుస్తకాన్ని రచించారు. ఇవాళ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో నటుడు తనికెళ్ల భరణి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఛార్మి, పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ, సత్య, శాండీ, సునీల్ కశ్యప్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ... సినిమాని చూసి పుస్తకం రాయడం ఇదే ప్రప్రథమం అన్నారు. పీహెచ్డీ గ్రంథాన్ని ఎలా పరిశోధన చేసి రాస్తారో... అదే స్థాయిలో మంగళ గౌరి ఈ పుస్తకాన్ని రాశారని తెలిపారు.
తాను నటించిన సినిమాపై పుస్తకం రావడం ఆనందంగా ఉందని, పూరీ లేకపోతే ఈ సినిమా లేదని నటి ఛార్మి అన్నారు. ఈ సినిమా చేసిన తరువాత దుబాయ్, యూఎస్ ఇలా ఎక్కడికి వెళ్లినా తనని జ్యోతిలక్ష్మీ అని పిలుస్తున్నారని ఛార్మి తెలిపారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మి నటించిన 'మిథునం' చిత్రంపై కూడా ఓ పుస్తకం రాయనున్నట్లు రచయిత్రి మంగళ గౌరి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







