అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఇండియా,కువైట్
- June 02, 2023
కువైట్: భారతదేశం, కువైట్ మధ్య ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై సంప్రదింపులు కువైట్ నగరంలో జరిగాయి. కువైట్ తరఫున అంతర్జాతీయ సంస్థల సహాయ మంత్రి అబ్దుల్ అజీజ్ సౌద్ మహ్మద్ అల్-జరల్లా చర్చలకు నాయకత్వం వహించగా.. భారత ప్రతినిధి బృందానికి యూఎన్ పొలిటికల్ జాయింట్ సెక్రటరీ ప్రకాష్ గుప్తా, కువైట్లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా నాయకత్వం వహించారు. రెండు దేశాల మధ్య ఈ తరహా సంప్రదింపులు ఇదే మొదటిది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సహా ఇతర అంతర్జాతీయ సంస్థలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. నామ్(NAM), G-77 ఫ్రేమ్వర్క్లో సహకారంతో సహా బహుపాక్షిక వేదికలపై పరస్పర ఆసక్తి ఉన్న రంగాలపై ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







