ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
- June 04, 2023
న్యూ ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం అయ్యారు. హస్తినలోని అమిత్ షా నివాసంలో 50 నిముషాల పాటు అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం కొనసాగింది. ఏపీ, తెలంగాణ సహా జాతీయ రాజకీయ అంశాలు, పొత్తులపై జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు చర్చించారు. పొత్తులు, ఎన్డీఏలో భాగస్వామ్యంపై ప్రాధమిక చర్చలు జరిగినట్లు సమాచారం.
భవిష్యత్ లో మరిన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ రానుంది. టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.
కాగా, ఐదేళ్ల తర్వాత బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్.. ఏపీలో పోటీ చేస్తుంది కాబట్టి కలిసి వెళ్తే రెండు రాష్ట్రాల్లో ప్రయోజనం ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, విపక్షాల ఐక్యత కసరత్తు నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







