హీట్ స్ట్రెస్ చట్టం ఉల్లంఘన.. ఇలా ఫిర్యాదు చేయండి
- June 04, 2023
దోహా, ఖతార్: జూన్ 1 నుండి పగటిపూట ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయడాన్ని ఖతార్ కార్మిక శాఖ నిషేధించింది. అయితే, ఈ చట్టం యొక్క ఏవైనా ఉల్లంఘనలను గుర్తిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కార్మిక శాఖ వెల్లడించింది. హీట్ స్ట్రెస్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను మంత్రిత్వ శాఖలోని లేబర్ ఇన్స్పెక్షన్ విభాగం 40288101లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమాచారాన్ని అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చారు. "కాలర్ను మా సిబ్బంది ఎటువంటి వ్యక్తిగత వివరాలు అడగరు. ఫిర్యాదు గురించి కంపెనీకి కూడా తెలియజేయరు. " అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







