అప్పుడు కైరా.. ఇప్పుడు మృణాల్ ఠాకూర్.!
- June 09, 2023
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమా చేసి బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ బాలీవుడ్లో పాపులర్ అయిపోయింది. అందుకు కారణం ఆమె అక్కడ నటించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీసే.
ఈ సిరీస్లో కైరా అద్వానీ పండించిన అడల్ట్ ఎక్స్ప్రెషన్స్ అప్పట్లో ఓ సంచలనం. ఆ సంచలనమే ఆమెను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ని చేసేసింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయింది కైరా అద్వానీ.
ఇప్పుడు అదే ‘లస్ట్ స్టోరీస్’కి సీక్వెల్ రాబోతోంది. ఈ సీక్వెల్లో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కైరా అద్వానీలాగే తెలుగులో సినిమా చేసి, ఈ వెబ్ సిరీస్లో ఛాన్స్ కొట్టేసింది మృణాల్ ఠాకూర్.
ఒకవేళ కైరా అద్వానీలాగే లక్కు కలిసొచ్చిందంటే, ‘లస్ట్ స్టోరీస్ 2’తో మృణాల్ దశ తిరిగిపోతుందంటే. అన్నట్లు ఈ సిరీస్లో మొదటి పార్ట్కి మించిన హాట్నెస్ వుండబోతోందట. మొదటి పార్ట్ని మించి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి.
అన్నట్లు, సీనియర్ బాలీవుడ్ భామ కాజోల్, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సిరీస్లో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







