కల తీరిందంటున్న "సరైనోడు"

- May 13, 2016 , by Maagulf
కల తీరిందంటున్న

అల్లు అర్జున్‌     ''గీతా ఆర్ట్స్‌ సంస్థలో కొన్ని సినిమాలు చేసినా, సరైన విజయం సాధించలేకపోయా అనే లోటు ఉండేది. దాన్ని 'సరైనోడు' తీర్చేసింది' అంటున్నారు అల్లు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'సరైనోడు'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి 20 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ సాధించింది. బన్నీ సినిమాల్లో 'రేసుగుర్రం' తరవాత వంద కోట్లు తెచ్చుకొన్న చిత్రమిదే. ఈ సందర్భంగా సితారతో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''నా సినిమాలు ఓవర్సీస్‌లో, నైజాంలో మంచి వసూళ్లు దక్కించుకొన్నాయి. ఆంధ్రాలోనూ బాగానే ఆడినా టాప్‌ 5లో నా సినిమా చూసుకోలేకపోయా. ఆ లోటు కూడా 'సరైనోడు' తీర్చింది. ఇదేం 'వూరమాస్‌' సినిమాకాదు. చాలా స్టైలీష్‌గా తీశాం. నా కోసం రెండు మూడు కోట్లు ఎక్కువ ఖర్చుపెట్టించా. అందుకే సినిమా అంత రిచ్‌గా వచ్చింది. మాస్‌ పల్స్‌ ఎలా పట్టుకోవాలో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. ఈ సినిమాతో అది మరోసారి రుజువు అయ్యింద''న్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com