టర్కీ లో వినూత్నంగా ప్రారంభమైన ఫ్యాషన్ షో
- May 13, 2016
టర్కీలోని ఇస్తాంబుల్లో ఇంటర్నేషనల్ మోడెస్ట్ ఫ్యాషన్ వీక్ శుక్రవారం ప్రారంభమైంది. రెండురోజుల పాటు జరిగే ఈ ఫ్యాషన్ షోలో ప్రపంచదేశాలకు చెందిన పలువురు డిజైనర్లు పాల్గొన్నారు. ఈ ఫ్యాషన్ షోకి రెండు ప్రత్యేకతలున్నాయి. మొదటిది.. హుందాగా కన్పించే దుస్తులు. అందుకే దీనిని మోడెస్ట్ ఫ్యాషన్ షో అన్నారు. రెండోది చారిత్రక హైదర్ పాషా రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంపై ర్యాంప్వాక్ నిర్వహించడం.
టర్కీలోని ముస్లిం ఫ్యాషన్ ఆన్లైన్ రిటైలర్ మోడానిసా ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. వారి సంప్రదాయం ప్రకారం రూపొందించిన పొడవాటి దుస్తులు వస్త్రప్రియులను ఆకట్టుకుంటున్నాయి. టర్కీలో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ ఇదే కావడం మరో విశేషం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







