యూఏఈ అధ్యక్షుడు హిందీలో ట్వీట్....భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం
- July 15, 2023
యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్న సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు అబుధాబికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉందని యూఏఈ అధినేత హిందీలో ట్విట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా గత పర్యటన నాటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. "మా ద్వైపాక్షిక సంబంధాల యొక్క కొనసాగుతున్న పురోగతి, స్థిరమైన ప్రపంచ వృద్ధిని ప్రోత్సహించడంలో మా భాగస్వామ్య ఆసక్తి, మా దేశాలు మరియు మన ప్రజల మధ్య సహకారాన్ని మరింత పెంచే మార్గాల గురించి మేము చర్చించాము." అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్య పరిష్కారాన్ని ప్రారంభించాయి. ఈ మేరకు అబుధాబిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కురుర్చుకున్నారు. క్రాస్ బోర్డర్ లావాదేవీలు మరియు చెల్లింపులను సులభతరం చేయడం, భారతదేశం-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య గొప్ప ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందాల లక్ష్యం.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







