యూఏఈ అధ్యక్షుడు హిందీలో ట్వీట్....భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం
- July 15, 2023
యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్న సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు అబుధాబికి వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉందని యూఏఈ అధినేత హిందీలో ట్విట్ చేయడం విశేషం. ఈ సందర్భంగా గత పర్యటన నాటి కొన్ని ఫోటోలను షేర్ చేశారు. "మా ద్వైపాక్షిక సంబంధాల యొక్క కొనసాగుతున్న పురోగతి, స్థిరమైన ప్రపంచ వృద్ధిని ప్రోత్సహించడంలో మా భాగస్వామ్య ఆసక్తి, మా దేశాలు మరియు మన ప్రజల మధ్య సహకారాన్ని మరింత పెంచే మార్గాల గురించి మేము చర్చించాము." అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్య పరిష్కారాన్ని ప్రారంభించాయి. ఈ మేరకు అబుధాబిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కురుర్చుకున్నారు. క్రాస్ బోర్డర్ లావాదేవీలు మరియు చెల్లింపులను సులభతరం చేయడం, భారతదేశం-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య గొప్ప ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందాల లక్ష్యం.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









