'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- June 30, 2026
దుబాయ్, జూన్ 30: యూఏఈలో ప్రారంభమైన ప్రముఖ స్టార్టప్ పెట్టుబడుల రియాలిటీ సిరీస్ 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్' కు పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దరఖాస్తుల గడువు ముగియకముందే 1,500 మంది వ్యవస్థాపకులు (ఫౌండర్లు) తమ దరఖాస్తులను సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
యూఏఈతో పాటు మధ్యప్రాచ్యం, భారత్, సింగపూర్, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. టెలివిజన్ కార్యక్రమంగా మాత్రమే కాకుండా, స్టార్టప్లకు పెట్టుబడులు, మార్గదర్శకత్వం, వ్యాపార అనుసంధానాలు, ప్రచారం కల్పించే వేదికగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు, దర్శకుడు, వ్యాపారవేత్త ఆర్. మాధవన్ సహ-సృష్టికర్త, వ్యాఖ్యాత, మెంటర్, వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ, "ప్రతి గొప్ప సంస్థ ఒక ఆలోచనపై ఉన్న నమ్మకంతోనే ప్రారంభమవుతుంది. ఆవిష్కరణలకు యూఏఈ ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన కేంద్రాల్లో ఒకటిగా ఎదిగింది. ధైర్యమైన ఆలోచనలు కలిగిన వ్యవస్థాపకులను గుర్తించి, వారికి ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం" అని అన్నారు.
ప్రముఖ సినీ నిర్మాత విపుల్ డి. షా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నారు. ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తల ప్రతిభకు తగిన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ వేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
జూలై 5, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అందిన దరఖాస్తుల నుంచి 70 అత్యుత్తమ స్టార్టప్లను ఎంపిక చేసి, ప్రముఖ పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణుల ముందుకు తమ వ్యాపార ఆలోచనలను ప్రదర్శించే అవకాశం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమం 2026 చివర్లో కలర్స్ టీవీ మిడిల్ ఈస్ట్లో ప్రసారం కానుండగా, ప్రముఖ ఓటీటీ వేదికల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. కార్యక్రమం ముగిసే నాటికి మొత్తం దరఖాస్తుల సంఖ్య 2,000 దాటే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రమాద బాధితుల ఫొటోలు తీస్తే జైలు.. QR10,000 వరకు ఫైన్..!!
- నేటితో అమెరికా-ఇరాన్ 60 రోజుల ఒప్పందం పూర్తి
- ఒమన్లో టెలికాం ప్రమోషనల్ మెసేజ్లపై ఆంక్షలు..!!
- నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్గా నియామకం..
- విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్ప్రెస్లు ప్రారంభం..
- దుబాయ్లో అద్దె చెల్లింపులకు ఇక లోన్లు అవసరం లేదు.. నెలవారీగా చెల్లించే అవకాశం..!!
- కువైట్లో పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల విక్రయంపై ఆంక్షలు..!!
- ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!
- సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్







